- త్వరలో అనుమతించనున్న యూజీసీ
న్యూఢిల్లీ: ఒకేసారి రెండు డిగ్రీలు పూర్తి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ను త్వరలో విడుదల చేయనున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ మంగళవారం తెలిపారు. కొత్తగా ప్రకటించిన నేషనల్ ఎడ్యుకేషన్పాలసీ (ఎన్ఈపీ)లో భాగంగా స్టూడెంట్స్ ఒకేసారి రెండు డిగ్రీలు చేసే వీలు కల్పిస్తున్నట్టు చెప్పారు. దీనివల్ల విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ స్కిల్స్ పెంచుకుంటారన్నారు. ఒకే యూనివర్సిటీ నుంచి ఒకేసారి రెండు డిగ్రీలు చేయవచ్చని, లేదా వేర్వేరు యూనివర్సిటీల నుంచైనా రెండు డిగ్రీలు చేయొచ్చని వెల్లడించారు. ఫిజికల్ మోడ్తోపాటు ఆన్లైన్లో కూడా రెండు డిగ్రీలు చదివే వీలు కల్పిస్తున్నట్టు జగదీశ్ కుమార్ చెప్పారు.