తెలుగు యోధాస్ బోణీ

తెలుగు యోధాస్ బోణీ

కటక్ : అల్టిమేట్‌‌ ఖో ఖో లీగ్ రెండో ఎడిషన్‌‌ను గత సీజన్‌‌ రన్నరప్ తెలుగు యోధాస్ విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో యోధాస్ 46–44తో ముంబై ఖిలాడీస్‌‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

రాహుల్ మండల్ 14 పాయింట్లతో యోధాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ ప్రతీక్ వారికర్ 10 పాయింట్లతో రాణించాడు. అంతకుముందు ఒడిశా జాగర్‌‌‌‌నాట్స్‌‌ 35–27తో రాజస్తాన్‌‌ వారియర్స్‌‌ను ఓడించింది.