
నిందితురాలిని వికారాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ కల్లు కాంపౌండ్ నుంచి కిడ్నాప్అయిన ఆరేండ్ల కీర్తన ఎట్టకేలకు దొరికింది. ఈ కేసులో నిందితురాలిని ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతానం కలగకపోవడంతోనే ఆమె పాపను తీసుకెళ్లిందని తెలిపారు. రంగపురం రజిని అనే మహిళ రాళ్లగూడలో కూలీ పనులు చేస్తుంటుంది. ఆమెకు సంతానం కలగలేదు.
కల్లు తాగే అలవాటున్న రజిని ఈ నెల 1న శంషాబాద్కల్లు కాంపౌండ్కు వెళ్లింది. అక్కడ ఆడుకుంటున్న కీర్తనను కిడ్నాప్ చేసి, తన వెంట వికారాబాద్ తీసుకెళ్లింది. పాప తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎయిర్ పోర్ట్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి, వెతకడం ప్రారంభించారు. చివరకు వికారాబాద్లో పాప ఉన్నట్లు తెలుసుకొని, అక్కడికి వెళ్లారు. రజినిని అదుపులోకి తీసుకొని, కీర్తనను ఆమె తండ్రికి అప్పగించినట్లు ఎస్సై అర్షద్అలీ పేర్కొన్నారు.