గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే.. నిరుద్యోగ సమస్య పరిష్కారం: ఎమ్మెల్యే విజయరమణారావు

గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే.. నిరుద్యోగ సమస్య పరిష్కారం: ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ అను బంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​తో కలిసి విజయరమణారావు బైక్ ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసి.. కేంద్రంలో గద్దెనెక్కిన బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి, కనీసం 2 లక్షలు కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ సమస్య కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. వంశీకృష్ణను కలిసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

 ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించినట్లే, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, పార్టీ నేత దుద్దిళ్ల శ్రీనుబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాగా, రైలు ప్రమాదంలో మృతి చెందిన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పెరిక లింగయ్య (55) మృత దేహానికి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి నివాళులర్పించారు. మృతుడి కుటుంబసభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు.