పాట్నాలో స్కామ్​పార్టీల భేటీ

పాట్నాలో స్కామ్​పార్టీల భేటీ
  • కేంద్ర హోం మంత్రి అమిత్​షా

ముంగేర్: పాట్నాలో ఈనెల 23న జరిగిన విపక్షాల భేటీని స్కామ్​ పార్టీల సమావేశంగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా గురువారం ఆరోపించారు. అపొజిషన్ లీడర్లు రూ.20 లక్షల కోట్ల విలువ చేసే స్కామ్ లకు పాల్పడ్డారన్నారు. విపక్ష నేతల సమావేశాన్ని నిర్వహించిన సీఎం నితీశ్​కుమార్​తో పాటు అవినీతి నేతలకు 2024 లోక్​సభ ఎన్నికల్లో బీహార్​ రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెపుతారన్నారు. బీహర్​లోని ముంగేర్​ పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన మెగా ర్యాలీలో అమిత్​ షా ఈ వ్యాఖ్యలు చేశారు.