- కేంద్ర హోం మంత్రి అమిత్షా
ముంగేర్: పాట్నాలో ఈనెల 23న జరిగిన విపక్షాల భేటీని స్కామ్ పార్టీల సమావేశంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ఆరోపించారు. అపొజిషన్ లీడర్లు రూ.20 లక్షల కోట్ల విలువ చేసే స్కామ్ లకు పాల్పడ్డారన్నారు. విపక్ష నేతల సమావేశాన్ని నిర్వహించిన సీఎం నితీశ్కుమార్తో పాటు అవినీతి నేతలకు 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెపుతారన్నారు. బీహర్లోని ముంగేర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన మెగా ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.