కిషన్ రెడ్డికి యూఎస్ అవార్డు

కిషన్ రెడ్డికి యూఎస్ అవార్డు

హైదరాబాద్, వెలుగు :  కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి యూఎస్ ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడలియన్ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రిగా టూరిజం, కల్చరల్ ను ఈశాన్య  రాష్ట్రాలతో పాటు అమెరికా వంటి దేశాలకు ప్రమోట్ చేసినందుకుగాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డు పొందిన మొదటి ఇండియన్ పొలిటీషిన్ కిషన్ రెడ్డినే అని ఆయన కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.