హైదరాబాద్ లో కొనసాగుతున్న కేంద్రమంత్రి  సింధియా పర్యటన 

హైదరాబాద్ లో కొనసాగుతున్న కేంద్రమంత్రి  సింధియా పర్యటన 

హైదరాబాద్ లో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పర్యటన కొనసాగుతోంది. పార్లమెంటరీ ప్రవాసీ యోజన కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంపాపేటలోని శుభం ప్యాలెస్ లో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హాజరయ్యారు. జిల్లా కోర్ కమిటీ సమావేశంలో.. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో బీజేపీ పార్టీ పరిస్థితి గురించి జ్యోతిరాదిత్య సింధియా అడిగి తెలుసుకున్నారు. 

పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ కు సింధియా బీజేపీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. పాతబస్తీలో ఇవాళ, రేపు బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలోపేతంపై ప్రధానంగా ఫోకస్ చేశారు. మలక్ పేట్, చంద్రాయణగుట్ట, గోషామహాల్, చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ పరిధిలో జ్యోతిరాదిత్య సింధియా పర్యటన కొనసాగనుంది. 

ఇవాళ సాయంత్రం కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి..ప్రత్యేక పూజలు చేయనున్నారు. రెండు రోజుల పాటు ఫలకనూమా ప్యాలెస్ లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బస చేయనున్నారు.