గవర్నర్ ను కేసీఆర్ అడుగడుగునా అవమానిస్తుండు

గవర్నర్ ను కేసీఆర్ అడుగడుగునా అవమానిస్తుండు

ఓటమి భయంతోనే కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ఏర్పాటుచేసిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి గైర్హాజరై సంప్రదాయాలను కేసీఆర్ మంటగల్పుతున్నారని ఆరోపించారు. గవర్నర్ పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవటం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కారు గవర్నర్ను అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కార్ను ప్రజలు పాతరేయటానికి సిద్ధంగా ఉన్నారని..తన కాళ్ళ కింద భూమి కదలిపోతోందన్న ఆందోళనలో కేసీఆర్ ఉన్నారని అన్నారు. 

బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. నిరాశ, నిస్పృహతో కేసీఆర్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేటీఆర్ ఎప్పటికీ సీఎం కాలేడన్న ఫ్రస్టేషన్లో కేసీఆర్ ఉన్నాడని.. ప్రధాని మోడీ సహా  కేంద్రానికి ఆయన సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణకు ఏం చేశారని.. దేశాన్ని ఉద్దరిస్తావంటూ  ప్రశ్నించారు. ఇంజనీర్ల సూచనలను పక్కనపెట్టి సొంత ఆలోచనతో సాగునీటి ప్రాజక్టులను నిర్మించి..ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. సెంటిమెంట్తో ముఖ్యమంత్రి కుర్చీలో కేసీఆర్ ఎక్కువ కాలం కూర్చోలేడని చెప్పారు.