
హైదరాబాద్: దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ మోతినగర్ లో ఆర్టిఫిషయల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో దివ్వాంగులకు కిషన్ రెడ్డి కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచామన్నారు. ప్రతి విషయంలో దివ్యాంగులకు కేంద్రసర్కార్ అండగా ఉంటోందని చెప్పారు.
Distributed aids & devices for Specially abled-Divyangjan & Senior Citizen beneficiaries under ADIP Scheme & Rashtriya Vayoshri Yojana (RVY) of @narendramodi Government at Jubilee Hills, Hyderabad today.
— G Kishan Reddy (@kishanreddybjp) August 26, 2022
These devices will empower our Divyangjan & senior citizens. pic.twitter.com/syHen4948r
దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి, బస్సు, రైలు పాస్లు, ఇతర రాయితీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. దివ్యాంగులను ఎవరైనా హింసిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.