నితిన్ గడ్కరీకి అస్వస్థత

నితిన్ గడ్కరీకి అస్వస్థత

సిలిగురి : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయన పశ్చిమ బెంగాల్ కు వెళ్లారు. రూ.1,206 కోట్లతో చేపట్టనున్న మూడు నేషనల్ హైవేలకు సిలిగురిలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత స్టేజీ నుంచి దిగిన గడ్కరీ.. తనకు అస్వస్థతగా ఉందని చెప్పారు. వెంటనే ఆయనను అక్కడున్న రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

డాక్టర్ల సూచన మేరకు సెలైన్ ఎక్కించారు. ఆ తర్వాత డాక్టర్లు వచ్చి ప్రాథమిక చికిత్స అందజేశారు. అనంతరం ఆయనను డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా ఇంటికి కారులో తీసుకెళ్లినట్లు బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా చెప్పారు. షుగర్ లెవల్స్ పడిపోవడం వల్లనే గడ్కరీ అస్వస్థతకు గురైనట్లు పార్టీ నేతలు తెలిపారు.