తెలంగాణాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది :  ప్రహ్లాద్‌ జోషి

తెలంగాణాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది :  ప్రహ్లాద్‌ జోషి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రూ.2.5లక్షల కోట్ల నిధులు ఇచ్చామని కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. హైదరాబాద్ నగర శివారు గుండ్ల పోచంపల్లి నుంచి బోయినపల్లి వరకు నిర్మాణమవుతోన్న 27 కిలోమీటర్ల జాతీయ రహదారి 44 పనులను కేంద్రమంత్రి  ప్రహ్లాద్‌ జోషి పరిశీలించారు. 

రూ.1300 కోట్ల వ్యయంతో ఐదు అండర్‌పాసు, నాలుగు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. వచ్చే డిసెంబర్ 24 వరకు నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే.. అధికారులు షెడ్యూల్‌ కంటే ముందే పూర్తి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రూ.2.5లక్షల కోట్ల నిధులతో పాటు రైల్వేకు రూ.300 కోట్లు ఇచ్చామని తెలిపారు. కేంద్రమంత్రి వెంట స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు.