ఎంఎస్‌‌ఎంఈలలో ఇంధన సామర్థ్య పెంపునకు ఆడీటీ స్కీమ్‌‌

ఎంఎస్‌‌ఎంఈలలో  ఇంధన సామర్థ్య పెంపునకు ఆడీటీ స్కీమ్‌‌
  • రేపు పానిపట్​లో లాంచ్​  చేయనున్న 
  • కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి 

హైదరాబాద్​, వెలుగు: కేంద్ర విద్యుత్‌‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)  కొత్త స్కీమ్ ఆడీటీ (అసిస్టెన్స్‌‌ ఇన్‌‌ డిప్లాయింగ్‌‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌‌ టెక్నాలజీస్‌‌ ఇన్‌‌ ఇండస్ట్రీస్‌‌ అండ్‌‌ ఎస్టాబ్లిష్‌‌మెంట్స్‌‌)ని ప్రారంభించనుంది. పానిపట్​లో జులై15న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఈ స్కీమ్ ను లాంచ్ చేయనున్నారు.

 బీఈఈ మీడియా సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఈ పథకం ప్రాముఖ్యతను వెల్లడించారు. దేశ ఎంఎస్ఎంఈ కార్యకలాపాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ఆడీటీ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఇంధన మార్పిడిని వేగవంతం చేయడం ఈ స్కీమ్ లక్ష్యాలని ఆయన చెప్పారు. 

తెలంగాణ పైలట్ ప్రాజెక్టుకు బీఈఈ ప్రశంసలు

ప్రధాన ఎంఎస్‌‌ఎంఈ క్లస్టర్‌‌లలోని ఔషధ పరిశ్రమలలో డీకార్బనైజేషన్‌‌ , ఇంధన సామర్థ్య పైలట్‌‌ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసినందుకు తెలంగాణ రెడ్కోను బీఈఈ ప్రశంసించింది. ఈ ప్రయత్నాలు గణనీయమైన ఇంధనం, ఖర్చును చేసి  తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచాయి.