అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్.. అంతా రిచ్చే అతిథులకు స్పెషల్ ఫ్లైట్

అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్.. అంతా రిచ్చే అతిథులకు స్పెషల్ ఫ్లైట్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఇండియన్ కుబేరుడు ముకేశ్ అంబానీ-, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సర్వం సిద్ధమవుతోంది. జులై 12వ తేదీన అనంత్ అంబానీ వివాహం జరగనుంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజులు ప్రీ వెడ్డింగ్ ఫెస్టివల్ ఉంటుంది. ముకేశ్ అంబానీ- నీతా అంబానీలకు ముగ్గురు సంతానం. అందులో చిన్న వాడు అనంత్ అంబానీ. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీ పెళ్లి 2023 జనవరి 19న నిర్చయించారు. 

అంబానీ ఇంట పెళ్లి అంటే  దిగ్గజ వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, స్టార్ క్రికేటర్లకు ఆహ్వానాలు అందుతాయి. అయితే, పెళ్లి జరిగే జామ్‌నగర్‌లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏ మాత్రం తగ్గకుండా అతిథులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముందస్తు పెళ్లి వేడుకలు, వివాహానికి హాజరయ్యే అతిథులు ఉండేందుకు 5 స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా అల్ట్రా- లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేశారు. 

ముందస్తు వివాహ వేడుకలకు ఆహ్వానాలు అందిన వారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింగ్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబా ఐగర్ వంటి వారు ఉన్నారు. అలాగే దేశీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, బిర్లా గ్రూప్ ఛైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆర్పీఎస్‌జీ గ్రూప్ హెడ్ సంజీవ్ గోయెంకా, అదర్ పూనావాలా, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్, నిఖిల్ కామత్, దిలీప్ సంఘ్వీ వంటి వారు ఉన్నారు. హాలీవుడ్ పాప్ సింగర్ రిహన్నా ఈ ప్రీ వెడ్డింగ్ లో ఫర్మామెన్స్ చేస్తోంది. ఇండియాలో ఇదే ఈమె ఫస్ట్ షో కావటం విశేషం. దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకులు, కళాకారులు కూడా ప్రోగ్రామ్స్ చేయనున్నారు.


క్రికెటర్లలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ సహా పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ నటులు ఉన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నారు.