V6 News

Telangana Global Summit :తెలంగాణతో యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ కీలక ఒప్పందం

Telangana Global Summit :తెలంగాణతో  యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్  కీలక ఒప్పందం

హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతోంది.పలు దేశ ,విదేశీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మొదటి రోజు 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు తెలంగాణతో  ఎంవోయూ కుదరగా..రెండో రోజు కూడా  భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు పారిశ్రామిక వేత్తలు. 

ఇప్పటికే  సీఎం రేవంత్ రెడ్డితో  గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ పిరోజ్ షా గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణపై సీఎంతో చర్చించారు. పాల ఉత్పత్తులు, FMCG, రియల్ ఎస్టేట్, ఆయిల్ ఫామ్ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. అలాగే భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ సంస్థ రూ.  1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణతో ఒప్పందం కుదుర్చుకుంది.

 లేటెస్ట్ గా  తెలంగాణ ప్రభుత్వంతో  అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్  ఎంవోయూ కుదుర్చుకుంది.  తెలంగాణలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ .ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ లో 60 వేల ఉద్యోగాలు సృష్టిస్తామని యూనివర్సిటీ సీనియర్ వైస్ ఛాన్సలర్ అనంత శేఖర్ తెలిపారు.  మొదట హైద్రాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రంలోని 13 జిల్లాలకు విస్తరిస్తామని ప్రకటించారు.  తెలంగాణలో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీ ఉందని.. తెలంగాణ పెట్టుబడులకు బెస్ట్ డెస్టినేషన్ అని అన్నారు. 

Also read:- ఫ్యూచర్ సిటీలో గోద్రేజ్ పెట్టుబడులు.. 

ఫ్యూచర్​ సిటీ వేదికగా సోమవారం రెండు రోజుల గ్లోబల్​ సమిట్​ ప్రారంభమైంది. మొదటి రోజు సుమారు రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వివిధ కంపెనీలు  35 ఎంవోయూలపై సంతకాలు చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో.. డీప్‌టెక్‌, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు అంగీకరించాయి.