దుర్గం చెరువులో డెడ్​బాడీ

దుర్గం చెరువులో డెడ్​బాడీ

మాదాపూర్, వెలుగు: దుర్గం చెరువులో వ్యక్తి డెడ్ బాడీని మాదాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 6.30 గంటలకు దుర్గం చెరువులో ఓ వ్యక్తి డెడ్ బాడీ తేలుతూ ఉండటాన్ని వాకర్స్ గుర్తించారు.

వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చెరువులో నుంచి డెడ్​బాడీని బయటికి తీయించి ఉస్మానియాకు తరలించారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు పోలీసులు తెలిపారు.