యోగి ఆదిత్యనాథ్ కు కరోనా పాజిటివ్

యోగి ఆదిత్యనాథ్ కు కరోనా పాజిటివ్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది. సీఎం కార్యాలయంలో పని చేస్తున్న అధికారుల్లో కొందరికి వైరస్ పాజిటివ్ గా తేలడంతో సీఎం యోగి ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్ కి వెళ్లారు. తాజాగా ఆయనకు టెస్టు చేయగా పాజిటివ్ గా వచ్చింది. దీంతో వైద్యుల సూచనలు పాటిస్తూ ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్ష చేయించుకున్నా. కరోనా పాజిటివ్ గా తేలింది. హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నా. నా పనులన్నీ వర్చువల్ గా నిర్వహిస్తున్నా' అని యోగి ట్వీట్ చేశారు.