60 వేల పోస్టులు.. 50 లక్షల మంది అభ్యర్థులు

60 వేల పోస్టులు.. 50 లక్షల మంది అభ్యర్థులు
  • యూపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షతో కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

లక్నో: ఉత్తరప్రదేశ్ లో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడాయి. శని, ఆదివారాల్లో నిర్వహించిన  ఈ పరీక్షకు భారీగా యువత హాజరయ్యారు. యూపీ ప్రభుత్వం 60,244 పోస్టుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల  నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఈ ఉద్యోగాలకు దాదాపుగా 50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శని, ఆదివారాల్లో రెండు షిఫ్ట్ ల్లో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపుగా 48 లక్షల మంది హాజరయ్యారు. ఫలితంగా యూపీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. రద్దీని ముందుగానే ఊహించిన ప్రభుత్వం అదనపు రవాణా సౌకర్యాలు కల్పించినా సరిపోలేదు.