లక్నో : యూపీ సర్కార్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్ పీ ఆర్) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏడాది పాటు ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జనాభా లెక్కలు చేపట్టేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవటంతో వచ్చే ఏడాది వరకు ఎన్పీఆర్ ను వాయిదా వేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపారు. 2021 ఏప్రిల్ వరకు ఎన్పీఆర్ కు సంబంధించి ఎలాంటి ప్రక్రియను స్టార్ట్ చేసేదీ లేదని తెలిపింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్పీఆర్ తొలివిడత కార్యక్రమం ఈ ఏప్రిల్ నుంచి ప్రారంభం కావాల్సి ఉండే. అన్ని రాష్ట్రాలకు ఇందుకు సంబంధించి కేంద్రం ఆదేశాలు కూడా ఇచ్చింది. కరోనా ఎఫెక్ట్ మొదలు కావటంతో ఎన్పీఆర్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఐతే కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించక ముందే యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం. కరోనా ఎఫెక్ట్ మరికొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉండటంతో కేంద్రం కూడా దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎన్పీఆర్ ఏడాది పాటు వాయిదా
- దేశం
- May 16, 2020
లేటెస్ట్
- సౌత్ ఇండియా నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది : జైరాం రమేశ్
- తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
- దాక్షాయణి ఈజ్ బ్యాక్
- ఇంటర్ కాలేజీల అఫిలియేషన్లు పూర్తయ్యాకే అడ్మిషన్లు చేపట్టాలి
- చందూ ఛాంపియన్..ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- ఇటలీలో టీవీఎస్
- క్రేజీ కాంబో..రౌడీతో రౌడీ బేబీ
- బర్త్డే వెకేషన్ కు.. మూడు అప్డేట్స్
- దేశాన్ని ప్రధాని మోదీ విభజిస్తున్నారు: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా
- నా డబ్బునే పట్టిస్తావా..ఓనర్ బెదిరింపు.. యువకుడు సూసైడ్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్