ఎన్పీఆర్ ఏడాది పాటు వాయిదా

ఎన్పీఆర్ ఏడాది పాటు వాయిదా

లక్నో : యూపీ సర్కార్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్ పీ ఆర్) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏడాది పాటు ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జనాభా లెక్కలు చేపట్టేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవటంతో వచ్చే ఏడాది వరకు ఎన్పీఆర్ ను వాయిదా వేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపారు. 2021 ఏప్రిల్ వరకు ఎన్పీఆర్ కు సంబంధించి ఎలాంటి ప్రక్రియను స్టార్ట్ చేసేదీ లేదని తెలిపింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్పీఆర్ తొలివిడత కార్యక్రమం ఈ ఏప్రిల్ నుంచి ప్రారంభం కావాల్సి ఉండే. అన్ని రాష్ట్రాలకు ఇందుకు సంబంధించి కేంద్రం ఆదేశాలు కూడా ఇచ్చింది. కరోనా ఎఫెక్ట్ మొదలు కావటంతో ఎన్పీఆర్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఐతే కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించక ముందే యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం. కరోనా ఎఫెక్ట్ మరికొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉండటంతో కేంద్రం కూడా దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.