ఉత్తరప్రదేశ్లోని ఒక విచిత్రమైన దృశ్యం చోటుచేసుకుంది. షామ్లీలోని మున్సిపల్ కౌన్సిల్లోని కొంతమంది సభ్యులు సమావేశంలో ఒకరినొకరు కొట్టుకున్నారు. పంచ్లు, కిక్లతో పాటు టేబుల్లను ఒకరిపైకి మరొకరు విసిరేసుకోవడంతో అక్కడి వాతావరణమంతా హీటెక్కింది. సభ్యుల్లో ఒకరు కుర్చీపైకి ఎక్కి మరో సభ్యుడిపైకి దూకేందుకు ప్రయత్నించడం కూడా కనిపించింది. మున్సిపల్ చైర్మన్ అరవింద్ సంగల్, ఎమ్మెల్యే ప్రసన్ చౌదరి పాల్గొన్న కౌన్సిల్ బోర్డు సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అఖిలేష్ యాదవ్ ఆగ్రహం
ఈ ఫైట్ కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్గా మారింది. అధికార బీజేపీపై విరుచుకుపడిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. Xలో వీడియోను పంచుకుంటూ.. అభివృద్ధి పనులు జరగనప్పుడు సమీక్షా సమావేశంలో ఇంకా ఏమి జరుగుతుందంటూ ఆయన ప్రశ్నించారు. అందుకే షామ్లీలోని కౌన్సిలర్లకు భౌతికంగా దెబ్బలు తగిలాయి. బీజేపీ పాలన అనేది అందరికీ ఓ గుణపాఠం వంటిది.. మీ స్వంత భద్రతను ఏర్పాటు చేసుకున్న తర్వాత సమీక్ష సమావేశానికి రండి అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
जब विकास कार्य हुए ही नहीं तो समीक्षा बैठक में और क्या होता, इसीलिए शामली में सभासदों के मध्य जमकर शारीरिक प्रहारों का आदान-प्रदान हुआ।
— Akhilesh Yadav (@yadavakhilesh) December 28, 2023
भाजपा राज का सबक : समीक्षा बैठक में अपनी सुरक्षा का प्रबंध स्वयं करके आएं। pic.twitter.com/9Fb8wBVwmh