క్యూరేటర్కు రూ. 2 లక్షల చెక్ ను అందించిన ఉపానస కామినేని సిస్టర్స్
హైదరాబాద్, వెలుగు: నెహ్రు జూపార్కు లో రెండు ఆసియా సింహాలను అపోలో ఫౌండేషన్ వైస్ చాన్సలర్ ఉపాసన కామినేని, హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ఓనర్ అనుష్పా కామినేని శనివారం దత్తత తీసుకున్నారు. సింహాలను చూసుకునేందుకు, వాటి నిర్వహణకు రూ. 2 లక్షల చెక్ను జూ అధికారులకు అందజేశారు. అనంతరం ఉపాసన కామినేని మాట్లాడుతూ జంతువుల సంరక్షణ, వాటిని బాగా చూసుకోవడం తనను ఎంతగానో ఆకట్టుకుందని అభినందించారు. జూ క్యూరేటర్ రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.