
అమెరికా ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ మోటార్స్ కో కీలక నిర్ణయం తీసుకుంది. యూరప్ దేశాల్లోని ఫోర్డ్ మోటార్స్ కంపెనీలో పనిచేసే3,200మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్నట్టు రాయిటర్స్ తెలిపింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి కారణమని తెలిపింది. అందులో భాగంగానే ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు మళ్లిన ఫోర్డ్ మోటార్స్ ఖర్చులను తగ్గించేందుకు తాజాగా లేఆఫ్ ప్రకటించింది.
ఈ నిర్ణయాన్ని జర్మనీలోని కొలోన్ లోని కార్ల తయారీ ఫ్యాక్టరీలో జరిగిన వర్క్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నారు. జర్మనీ కేంద్రంగా సాగుతున్న ఈ కార్ల ఉత్పత్తి కంపెనీలో ఉద్యోగాల తీసివేత తీవ్ర ప్రభావం చూపించనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. గతేడాదిలోనే దాదాపు 3వేల మంది సిబ్బందిని తొలగించిన ఫోర్డ్ కంపెనీ... దశాబ్దం చివరినాటికి యూరప్ దేశాల్లో పూర్తిగా కార్ల తయారీ మొత్తం ఎలక్ట్రిక్గా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.