
కరోనా లో నియంత్రణలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 60 రోజుల లాక్ డౌన్ లో విపక్షాలు పలు సూచనలు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇందుకు నిరసనగా రేపు(గురువారం) ఏఐసీసీ ఆధ్వర్యంలో భారీ ఆన్ లైన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబానికి రూ.10 వేల రూపాయల నగదు అందించాలన్నారు. వలస కార్మికుల అవస్థలను పట్టించుకోలేదన్నారు. చిన్నతరహ పరిశ్రమలు కుప్పకూలిపోయాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయాలన్నారు. ఉపాధి హామి పనులను 100 – 200 రోజులకు పెంచాలన్నారు. 4 ప్రధాన డిమాండ్లతో సోషల్ మీడియా క్యాంపెయిన్ లో యువకులు పాల్గొనాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1500 మంది, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 10 వేల మంది క్యాంపెయిన్ లో పాల్గొనాలని సూచించారు.