యూపీలోని రాయ్ బరేలీలో దారుణం జరిగింది. రూ.500 కోసం కన్నతండ్రిని చంపాడు ఓ కొడుకు. నిందితుడు సంజయ్ యాదవ్ను పోలీసులు గురువారం (జనవరి 4) అరెస్టు చేశారు.
నిందితుడు సంజయ్, తండ్రి త్రిలోకి రాయ్ బరేలీలోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. త్రిలోక్ ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా పోలీసులు ఇటుకబట్టి యాజమానిని సంప్రదించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. రూ.500 కావాలని సంజయ్ తండ్రి త్రిలోక్ తనకు కాల్ చేశాడని ఇటుకబట్టి యజమాని పోలీసులకు చెప్పాడు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని తన కొడుకు బెదిరిస్తున్నట్లు త్రిలోక్ తనతో చెప్పినట్లు తెలిపారు.
సంజయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించి నిజం రాబట్టారు. సంజయ్ తన తండ్రి త్రిలోక్ ను రూ.500 అడిగాడు. ఇవ్వకపోవడంతో చెక్కపలకతో తండ్రి తలపై కొట్టాడు. దీంతో అక్కడిక్కడే తన తండ్రి త్రిలోక్ కిందపడి పోయాడు. తర్వాత మృతదేహాన్ని ఇంటి బయట పడేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామని తెలిపారు.