పొలంలో పడ్డ యుద్ద విమానం ఇంధన ట్యాంక్.. సాంకేతిక లోపమే కారణం

పొలంలో పడ్డ యుద్ద విమానం ఇంధన ట్యాంక్.. సాంకేతిక లోపమే కారణం

భారత వైమానిక దళం (IAF) జాగ్వార్ జెట్‌కు చెందిన అడిషినల్ ఫ్యూయల్ ట్యాంక్ శిక్షణా విమానంలో 'సాంకేతిక లోపం' కారణం తలెత్తింది. ఈ క్రమంలో జూలై 24న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో క్రాష్-ల్యాండ్ అయింది. ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న సెంట్రల్ ఎయిర్ కమాండ్ ప్రకారం, సంత్ కబీర్ నగర్‌లో IAF జాగ్వార్ విమానం ఇంధన ట్యాంక్ పొలంలో ల్యాండ్ కావడంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

"గోరఖ్‌పూర్ నుంచి శిక్షణ కోసం ఒక యుద్ధ విమానం గగనతలంలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు" అని CEC ట్వీట్ చేసింది. ట్రైనింగ్ మిషన్ సమయంలో గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరిన విమానం లోపాన్ని ఎదుర్కొంది.

ఈ ఘటనపై సంత్ కబీర్ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ వెంటనే ఐఏఎఫ్‌కి సమాచారం అందించడంతో ఎయిర్‌ఫోర్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఇంధన ట్యాంక్‌ను గుర్తించింది. అంతకుముందు, సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో వైమానిక దళ విమానం ఇంధన ట్యాంకులను పోలిన రెండు వస్తువులు కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు.

A fighter aircraft was airborne for a training mission from Gorakhpur. The aircraft experienced technical malfunction which necessitated jettisoning of external stores. There was no damage to life or property in the process.

— CAC, IAF (@CAC_CPRO) July 24, 2023