అయోధ్య రామాలయం జనవరిలో ప్రారంభం!

అయోధ్య రామాలయం జనవరిలో ప్రారంభం!

అయోధ్య రామాలయం జనవరిలో ప్రారంభం!

లక్నో : వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పటికే  ఆలయ నిర్మాణం, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల విస్తరణ సహా మౌలిక సదుపాయా ల కల్పనకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. సహదత్‌‌గంజ్‌‌ నుంచి నయా ఘాట్‌‌ వరకు 13 కి.మీ.రహదారి పనులు కొనసాగుతున్నాయని పేర్కొంది.

రామజానకి పథ్, భక్తి పథ్ నిర్మాణానికి నమూనా పూర్తయినట్లు వెల్లడించింది. ఈ రెండు కారిడార్లు శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హి ఆలయానికి భక్తుల రాకపోకలను సులభతరం చేయనున్నా యి. రామాలయం ప్రారంభోత్సవానికి రావాలని ప్రజలను సీఎం యోగి ఆహ్వానించారని ప్రభుత్వం తెలిపింది. ఆలయ పనుల పురోగతిని సీఎం క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నారని పేర్కొంది.