మరో హిందూ పుణ్యక్షేత్రం.. కల్కీధామ్కు మోదీ శంకుస్థాపన

మరో హిందూ పుణ్యక్షేత్రం.. కల్కీధామ్కు మోదీ శంకుస్థాపన

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో మరో హిందూ పుణ్యక్షేత్రం కల్కీ ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా మాట్లాడిన మోదీ.. జనవరి 22  అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట  కొత్త శకానికి నాంది పలికిందన్నారు. ఈ రోజు సాధువుల భక్తితో, ప్రజల స్ఫూర్తితో మరో పుణ్యక్షేత్రానికి శంకుస్థాపన జరుగుతోందన్నారు. ఆచార్యులు, సాధువుల సమక్షంలో మహా కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయడం తన  అదృష్టమన్నారు. భారతీయ విశ్వాసానికి కల్కి ధామ్ మరో గొప్ప కేంద్రంగా మారుతుందని చెప్పారు. 

ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కూడా  కాబట్టి ఈ రోజు మరింత పవిత్రమైంది,స్ఫూర్తిదాయకమైనదన్నారు మోదీ. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాదాలకు మోదీ నివాళి అర్పించారు.