ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో మూడు స్టేషన్ల పేర్లను మారుస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ స్టేషన్లలో ప్రతాప్గఢ్ జంక్షన్, అంటు స్టేషన్, విశ్వనాథ్గంజ్ స్టేషన్ ఉన్నాయి. ఉత్తర రైల్వే నోటిఫికేషన్ ప్రకారం, ప్రతాప్గఢ్ జంక్షన్ని బెల్హా దేవి ధామ్గా, అంటు స్టేషన్ను మా చంద్రికా దేవి ధామ్గా మార్చారు. విశ్వనాథ్గంజ్ స్టేషన్ను ఇప్పుడు శనిదేవ్ ధామ్ విశ్వనాథ్ అని పిలవనున్నారు.
రాష్ట్రంలోని మూడు స్టేషన్ల పేర్లను మార్చాలని కోరుతూ ప్రతాప్గఢ్ ఎంపీ సంగం లాల్ గుప్తా కేంద్రానికి ప్రతిపాదన పంపిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ జూలైలో ఈ స్టేషన్ల పేరు మార్చడానికి ఆమోదించింది. తాజాగా ఉత్తర రైల్వే అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.