ఉత్తరాఖండ్ వరదల ఎఫెక్ట్.. ఢిల్లీలో నీళ్లకు కరువు

ఉత్తరాఖండ్ వరదల ఎఫెక్ట్.. ఢిల్లీలో నీళ్లకు కరువు

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్​లో వరద ప్రవాహం 500 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న ఢిల్లీపై ప్రభావం చూపింది. వేలాది ఇండ్లకు తాగునీటి సప్లయ్ నిలిచిపోయింది. వరద ప్రవాహంతో రిషిగంగా వ్యాలీలో పెద్దఎత్తున మట్టి, శిథిలాలు పేరుకుపోయాయని, వాటర్ ట్రీట్​మెంట్ ప్లాంట్​లు ఫుల్ కెపాసిటీతో పని చేయడంలేదని, తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందని అధికారులు అంటున్నారు. అయితే ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఢిల్లీ వాటర్ బోర్డు వైస్ చైర్ పర్సన్ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, వాటర్ ట్రీట్​మెంట్ ప్లాంట్లు ఫుల్ కెపాసిటీతో పని చేయడంలేదన్నారు. మట్టి, బురద వల్ల ఫిల్టర్లను క్లీన్ చేయడానికి సిబ్బంది 24 గంటలూ పని చేస్తున్నారని తెలిపారు. 2 కోట్లకుపైగా జనాభా ఉన్న ఢిల్లీలో ఏటా సమ్మర్​లో వాటర్ సమస్య ఎదురవుతుంది. యమునా నది నుంచి 60%, గంగా నది నుంచి 34% నీళ్లు ఢిల్లీకి సప్లయ్ అవుతాయి. ధౌలిగంగలో మంచు చరియలు విరిగిపడి పోటెత్తిన వరదతో నది మొత్తం బురదమయమై ప్రవహిస్తోంది.

For More News..

ప్రశ్నించే గొంతు మూగబోయింది

ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది

కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ

ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది