రేపటి నుంచి పోలీస్, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్

రేపటి నుంచి పోలీస్, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్

హైదరాబాద్‌: రేపటి నుంచి పోలీస్, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని తెలిపారు. నిమ్స్‌లో 500 ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్స్‌, గాంధీలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి అనుగుణంగా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ రెండో దశలో భాగంగా మున్సిపల్‌, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ వేయడానికి సన్నద్ధం అవుతున్నారు. కేంద్రం సూచనల మేరకు రెండో దశ వ్యాక్సినేషన్‌ నిర్వహించడానికి వైద్య ఆరోగ్య శాఖ కసరత్తులు చేస్తోంది. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు తగ్గట్టుగా రెండో దశ వ్యాక్సినేషన్‌లో కేంద్ర ప్రభుత్వం వీరికి ప్రాదాన్యం ఇస్తోంది.