
హైదరాబాద్, వెలుగు: పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం చేరుకున్న మంత్రి వాకిటి శ్రీహరికి వేదమంత్రోచ్చారణలతో పండితులు స్వాగతం పలికారు.
అనంతరం సెక్రటేరియెట్లోని రెండో ఫ్లోర్లో తనకు కేటాయించిన చాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరికి మంత్రి జూపల్లితో పాటు పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.