జ్ఞానవాపిలో పూజలకు వారణాసి కోర్టు ఓకే

జ్ఞానవాపిలో  పూజలకు వారణాసి కోర్టు ఓకే

లక్నో: వారణాసిలో జ్ఞానవాపి మసీదు ఏరియాలోని సీల్డ్ బేస్​మెంట్​లో హిందూ పిటిషనర్లు పూజలు చేసుకోవచ్చని సిటీ కోర్టు తీర్పు చెప్పింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బారికేడ్లను తొలగించి వారం రోజుల్లో బేస్​మెంట్​ను రెడీ చేయాలని పేర్కొంది. కాశీ విశ్వనాథ్  ఆలయానికి చెందిన పూజారులతో పూజలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆ మసీదు బేస్​మెంట్​లో పూజలు చేసుకునేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని ఈ కేసులో నలుగురు హిందూ మహిళల తరపున వాదిస్తున్న అడ్వొకేట్  విష్ణుశంకర్  జైన్  అన్నారు. కాగా, సిటీ కోర్టు తీర్పును జ్ఞానవాపి మసీదు కమిటీ హైకోర్టులో సవాలు చేయనుంది. ఈ మసీదులోని బేస్ మెంట్​లో నాలుగు సెల్లార్లు ఉన్నాయి. ఒక సెల్లార్  పూజారుల ఫ్యామిలీ ఆధీనంలో ఉంది. వంశపారంపర్య పూజారులుగా అక్కడ పూజలు చేసుకునేందుకు తమకు హక్కు ఉందని ఆ కుటుంబం మొదటి నుంచి వాదిస్తోంది. 1993 వరకు పూజారి సోమనాథ్  వ్యాస్  అక్కడ పూజలు చేసేవారని తెలిపింది. కాగా, జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్​లోని వజుఖానా ప్రాంతంలో శివలింగం బయటపడిందని, ఆ విషయంపై సైంటిఫిక్  సర్వే నిర్వహించాలని కోరుతూ హిందూ మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.