మాఘమాసం కొనసాగుతుంది. చదువుల తల్లి .. సరస్వతిదేవి పుట్టిన రోజు మాఘమాసం శుద్ద పంచమి. దీనినే వసంత పంచమి.. శ్రీ పంచమి అంటారు. విశ్వావశునామ సంవత్సరంలో జనవరి 23వ తేదీన దేశ వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. పండితులు.. సిద్దాంతులు తెలిసిన వివరాల ప్రకారంచదువుకునే పిల్లలు ఈ రోజున (జనవరి 23) కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే చదువులో రాణిస్తారని చెబుతున్నారు. వసంత పంచమి రోజు పిల్లలు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. .
చదువుకునే పిల్లలకు వసంత పంచమి చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ( జనవరి 23) చదవుల తల్లి.. సరస్వతి దేవిని పూజించడం వలన విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఙ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా.. కొత్త ఆలోచనలు రావడం.. పాఠశాలలో... పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.
ALSO READ : వందేళ్ల తరువాత మకరంలోకి మూడు పవర్ ఫుల్ గ్రహాలు..
వసంతపంచమి శుభముహూర్తం
- వసంతపంచమి ప్రారంభ సమయం :జనవరి 23 శుక్రవారం తెల్లవారుజామున 02.22 గంటలకు
- వసంతపంచమి ముగింపు సమయం : జనవరి 24 శనివారం తెల్లవారుజామున 01:46 గంటలకు
- సూర్యోదయ తిథి ప్రకారం జనవరి 23వ తేదీ శుక్రవారం రోజున వసంత పంచమి పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
- సరస్వతి పూజకు శుభ సమయం : జనవరి 23 ఉదయం 7:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:33 గంటల వరకు
వసంత పంచమి రోజున చిన్న పిల్లలు తమ విద్యా జీవితం ప్రారంభిస్తారు. అంటే ముహూర్తంతో సంబంధం లేకుండా అక్షరాభ్యాసం చేస్తారు. అందుకే ఈ ఏడాది జనవరి 23న సరస్వతి దేవాలయాలు కిటకిటలాడుతాయి.
ALSO READ : మూలలు పెరిగిన స్థలం కొనవచ్చా..
వసంతపంచమి ( జనవరి 23) రోజున విద్యార్థులు సరస్వతి దేవిని పూజించాలి. అవకాశం ఉన్నవారు.. ఉండగలిగిన వారు ఉపవాస దీక్షను పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని.. పూజా మందిరంలో సరస్వతి దేవి విగ్రహాన్ని కాని.. చిత్ర పటాన్ని కాని ఉంచాలి. ఆ తరువాత షోడశోపచారాల పూజలు చేసి.. సరస్వతి అష్టోత్తరం తో అమ్మవారిని పూజించి ధూపం.. దీపం.. దీపం .. నైవేద్యం సమర్పించాలరు. ఇలా చేస్తే పిల్లలకు విద్యా పరంగా ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. అలా చేస్తే.. వారి జ్ఞానాభివృద్ధి సులభం అవుతుంది. పాఠశాలల్లో.. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు పొంది.. జీవితంలో విజయం సాధించడం ఖాయమని పండితులు చెబుతున్నారు.
ALSO READ : చాక్లెట్ రెసిపీ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి..
సరస్వతి దేవత జ్ఞానం, కళ, సంగీతం, విద్య.. విజ్ఞానానికి అదిష్ఠాన దేవత. ఆమె పుట్టిన రోజున అనగా వసంత పంచమి రోజున ఈ దేవతను ప్రత్యేకతంగా పూజలు చేస్తారు. అలా చేయడం వలన విద్యార్థులకు చదువులో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. విద్యార్థులకు మంచిగా చదివేందుకు ప్రేరణ ఇవ్వడానికి సరస్వతి దేవతను పూజించడం ద్వారా వారు నూతన ఆశలు, శక్తిని పొందుతారు.ఈ రోజున(జనవరి 23) సరస్వతి దేవిని పూజించి ...ఉపవాసం ఉండడం వల్ల విద్యార్థుల జీవితాల్లో ఆనందం, విజయం, ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు
