షాద్​నగర్​లో బీఆర్ఎస్​ను చిత్తుగా ఓడించాలి : వీర్లపల్లి శంకర్

షాద్​నగర్​లో బీఆర్ఎస్​ను చిత్తుగా ఓడించాలి : వీర్లపల్లి శంకర్

 షాద్​నగర్, వెలుగు: షాద్​నగర్ సెగ్మెంట్​లో బీఆర్ఎస్​ను చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. గురువారం ఫరూఖ్​నగర్ మండలం పీర్లగూడ, చౌలపల్లి, కిషన్​నగర్, భవానీ గుట్ట తండా గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన రోడ్ షోలో వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. షాద్​నగర్ సెగ్మెంట్​లో ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ కు ఓటేయొద్దన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఒకసారి ఓడినా ప్రజల మధ్యే ఉన్నానని వీర్లపల్లి శంకర్ తెలిపారు. షాద్ నగరే తనకు ఇల్లు అని.. ఇక్కడి ప్రజలే తన కుటుంబసభ్యులన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ వెంకట్రామి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, మైనార్టీ నేతలు ఇబ్రహీం, కార్యకర్తలు పాల్గొన్నారు.