ఇండియాలో టమాటా ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో చూస్తూనే ఉన్నాం. ఓ మోస్తరు టమాటాలు అమ్మిన వ్యక్తి రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిన సంఘటల్నీ ఇటీవల చూశాం. అంత కాస్ట్లీ టమాటాను రక్షించుకోవడం కూడా ఇప్పుడు వ్యాపారులకు టాస్క్ అయిపోయింది. ప్రస్తుతం భారత్లో టమాటాల ధర రూ.150 పైనే పలుకుతోంది. అయితే నేపాల్ నుంచి అక్రమంగా టమాటాలను స్మగ్లింగ్ చేస్తున్న లారీలను జులై 18న పోలీసులు పట్టుకున్నారు.
పెరిగిన టమాటా ధరల నేపథ్యంలో నేపాల్ నుంచి ఇండియా కూరగాయల దిగుమతిని నిషేధించింది. నిషేధం అమలులో ఉన్నా ఇటీవల ఆ దేశ సరిహద్దు నుంచి ఇండియాకు రెండు లారీల్లో టమాటాలు అక్రమంగా తరలిస్తున్నట్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వాహనాలను సరిహద్దు పోలీసులు అడ్డుకొని ఇండోనేపాల్ సరిహద్దులోని భారత కస్టమ్స్ కార్యాలయానికి పంపించారు.
అక్కడ అధికారులు వారి నుంచి డబ్బులు తీసుకుని వాహనాలను అనుమతించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు డబ్బులు వసూలు చేసిన అధికారులను సస్పెండ్ చేశారు. కూరగాయల దిగుమతిని సైతం భారత్నిషేధించడంపై నేపాల్వ్యాపారులకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ముంబయి రిటైల్మార్కెట్లో కిలో టమాట ప్రస్తుత ధర రూ.160గా ఉంది.