వెలుగు టోర్నీ : LB స్టేడియంలో నేడే సెమీస్‌ ఫైట్‌

వెలుగు టోర్నీ : LB స్టేడియంలో నేడే సెమీస్‌ ఫైట్‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పల్లె ప్రతిభకు పట్టం కడుతూ గ్రామీణ క్రికెటర్ల టాలెంట్‌ ను వెలికితీస్తున్న వెలుగు క్రికెట్‌ టోర్నమెంట్‌ లాస్ట్‌ స్టేజ్‌ కు వచ్చేసింది. మెగా టోర్నీ సెమీఫైనల్స్‌‌‌‌‌‌‌‌ మ్యా చ్‌ లు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో బుధవారం జరగనున్నాయి. జిల్లా స్థా యిలో అదరగొట్టి.. క్వా ర్టర్‌ ఫైనల్లో ప్రత్యర్థులను పడగొట్టిన నాలుగు జట్లు పోటీకి సిద్ధమయ్యాయి. ఎన్నో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యా చ్‌ లకు ఆతిథ్యం ఇచ్చిన ప్రఖ్యాత స్టేడియంలో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యాయి. బుధవారం ఉదయం జరిగే మొదటి సెమీఫైనల్లో కొత్తగూడెం, నిజామాబాద్‌ అర్బన్‌ తలపడనున్నాయి. మధ్యాహ్నం జరిగే రెండో సెమీస్‌‌‌‌‌‌‌‌లో మహబూబ్‌ నగర్‌, రామగుండం పోటీ పడనున్నాయి.

ఉమ్మడి జిల్లాల్లో చాంపియన్లుగా నిలిచిన ఈ నాలుగు జట్లు క్వా ర్టర్‌ ఫైనల్లోనూ అదరగొట్టాయి. క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో కొత్తగూడెం 35 పరుగుల తేడాతో వరంగల్‌‌‌‌‌‌‌‌ వెస్ట్‌ పై నెగ్గగా, నిజామాబాద్‌ అర్బన్‌ ఆరు వికెట్ల తేడాతో  సిద్దిపేటపై విజయం సాధించింది. రామగుండం ఎనిమిది పరుగుల తేడాతో ఆదిలాబాద్‌ ను, మహబూబ్‌ నగర్‌ 77 పరుగుల తేడాతో మిర్యాలగూడను ఓడించి సెమీస్‌‌‌‌‌‌‌కు దూసుకొచ్చాయి. సెమీస్‌‌‌‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌‌‌‌లో గెలిచే రెండు జట్లు గురువారం జరిగే డే/నైట్‌ ఫైనల్లో టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌ చేస్తాయి. దానికంటే ముందు సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఓడిన జట్ల మధ్య థర్డ్‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఫైనల్‌‌‌‌‌‌‌‌ విజేత లక్ష రూపాయలు, రన్నరప్‌ టీమ్‌‌‌‌‌‌‌‌ 50 వేల ప్రైజ్‌ మనీ అందుకుం టాయి. సెమీస్‌‌‌‌‌‌‌, ఫైనల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌ ల కోసం ఎల్బీ స్టేడియం ముస్తా బైంది. ఫైనల్‌‌‌‌‌‌‌‌ మ్యా చ్‌ కు టీఆర్‌ ఎస్‌‌‌‌‌‌‌‌ వర ్కింగ్‌ ప్రెసిడెం ట్‌ కె. తారక రామారావు, హీరో నాని ము ఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.