29న కాంగ్రెస్​లోకి వేముల వీరేశం

29న కాంగ్రెస్​లోకి వేముల వీరేశం
  • ఢిల్లీలో రాహుల్, ఖర్గే అందుబాటులో లేక వాయిదా

నల్గొండ, వెలుగు :  నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ నెల 29న కాంగ్రెస్​ పార్టీలో చేరనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం వీరేశం శనివారమే పార్టీలో చేరాల్సి ఉంది. కానీ, రాహుల్​గాంధీ, మల్లికార్జున్​ ఖర్గే అందుబాటులో లేకపోవడంతో 29కి వాయిదా పడింది. అదేరోజు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు రేఖానాయక్​, మైనంపల్లి హన్మంతరావుతో సహా పలువురు కాంగ్రెస్​లో చేరే అవకాశం ఉంది. 

వీళ్లతో పాటే వీరేశం కూడా పార్టీలో అధికారికంగా చేరనున్నారు. కాగా, వీరేశం శనివారం ఢిల్లీలో పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, స్టేట్​ఇన్​చార్జ్​మాణిక్​ రావు ఠాక్రేతోపాటు ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో భేటీ అయ్యారు. రేవంత్​ సమక్షంలో నకిరేకల్​కు చెందిన వీరేశం వర్గీయులు గాదగోనికొండయ్య, వీరా అర్జున్ రెడ్డి,  నకిరేకంటి నరేందర్, దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, అచ్చాలు గౌడ్, రామన్నపేట సర్పంచ్​ భర్త పృథ్వీ, బొజ్జ సుందర్, మాధవరెడ్డి మల్లేశ్, రఘుమా రెడ్డి తదితరులు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.