రాజన్న హుండీ ఆదాయం రూ.1 కోటి 14 లక్షలు

రాజన్న  హుండీ ఆదాయం రూ.1 కోటి 14 లక్షలు


వేములవాడ, వెలుగు:  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి హుండీల ద్వారా  రూ. కోటీ 14 లక్షల ఆదాయం వచ్చింది. 14 రోజుల్లో  భక్తులు  హుండీల్లో వేసిన  కానుకలను మంగళవారం ఆలయ ఓపెన్​ స్లాబ్ లో భారీ భద్రత మధ్య దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు.  ఇందులో కోటి  14  లక్షల నగదు,   124.5   గ్రాముల బంగారం ,   ఏడున్నర కిలోల వెండి వచ్చిందని  ఈవో కృష్ణ ప్రసాద్​ తెలియజేశారు. హుండీ లెక్కింపులో ఎండోమెంట్​ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్,  ఏఈఓలు హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.