
వేములవాడ, వెలుగు: -వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం వేములవాడలోని పలు వార్డుల్లో సైడ్ డ్రైన్, సీసీ రోడ్లు, సీసీ కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే పరమావధిగా ముందుకు పోతున్నామని తెలిపారు. పట్టణంలో 34 కుల సంఘ భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించామన్నారు.
పట్టణంలో రాజన్న ఆలయ అభివృద్ధి రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయని, రోడ్డు వెడల్పులో కొంతమందికి ఇబ్బంది కలుగుతుందని, అందుకు తనకు కూడా బాధగా ఉందన్నారు. త్వరలో రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.76 కోట్లతో టెండర్ కానున్నట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ చైర్మన్ రొండి రాజు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, తోట రాజు, తదితరులు పాల్గొన్నారు.