
డీఎస్ పార్ధివ దేహానికి నివాళి అర్పించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. డీఎస్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అని కొనియాడారు. మిత్రులు డి. శ్రీనివాస్ మృతి చెందారని తెలిసి చాలా బాధ పడ్డానన్నారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడిని ప్రజలు కోల్పోయారననారు. ఆనాటి రాజకీయ నేతల్లో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి డీఎస్ అని అన్నారు. ఏ మాత్రం గర్వం లేకుండా అందర్నీ కలుపుకుపోయేవారన్నారు. డీఎస్ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందనన్న వెంకయ్యనాయుడు.. డీఎస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు.
డీఎస్ అంత్యక్రియలు రేపు నిజామాబాద్ లో అధికారిక లాంఛనాలతో జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. డీఎస్ పార్థివ దేహాన్ని ఇవాళ సాయంత్రం నిజామాబాద్ లోని స్వగ్రామానికి తరలించనున్నారు. జూన్ 30న అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని స్థలంలో అంత్యక్రియలు చేయనున్నారు.