వెయ్ దరువెయ్ మూవీ ట్రైలర్‌‌‌‌ విడుదల

వెయ్ దరువెయ్ మూవీ ట్రైలర్‌‌‌‌ విడుదల

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం ‘వెయ్ దరువెయ్’.  మార్చి 15న సినిమా విడుదల కానుంది.  బుధవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ‘గుడ్‌‌లో గుడుంబా శంకర్, ఈగోలో ఇస్మార్ట్ శంకర్, స్నేహంలో సాయిరామ్ శంకర్.. బాకీ ఉన్నాను కాబట్టి ఇంత బాధ్యతగా చెబుతున్నా’ అంటూ సాయిరామ్ చెప్పిన డైలాగ్ ఇంప్రెస్ చేస్తుంది. 

సునీల్ విలన్‌‌ రోల్‌‌లో కనిపిస్తుండగా, హెబ్బా పటేల్, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, పృథ్వి ఇతర పాత్రలు పోషించారు. ఇక ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌కు దర్శకుడు హరీష్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణా రెడ్డి అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని కోరారు. ‘బంపర్ ఆఫర్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి లాంటి ఎమోషన్స్‌‌తో ఈ సినిమా ఉంటుంది’ అన్నాడు సాయిరామ్ శంకర్.  అందర్నీ ఆకట్టుకునే సినిమా అవుతుందని దర్శక నిర్మాతలు చెప్పారు. నటులు సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్  భీమ్స్ సిసిరోలియో తదితరులు పాల్గొన్నారు.