పవిత్రమైన పదాలను కూడా సిగ్గుపడేలా పలుకుతున్నారు

పవిత్రమైన పదాలను కూడా సిగ్గుపడేలా పలుకుతున్నారు

రాజకీయ నాయకులు ప్రత్యర్ధులమే కానీ శత్రువులు కాదు

అసెంబ్లీల్లో ప్రజా నాయకులు అమ్మ, అక్కలను అవమానించేలా మాట్లాడుతున్నారని, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఇదే పద్ధతి కనిసిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన చెందారు. అత్యంత పవిత్రమైన పదాలను చట్టసభల్లో నాయకులు సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నారన్నారు. విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..  చట్టసభల్లో రాజకీయపార్టీల నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్, శాసనసభల్లో నాయకులు వాడుతున్న భాష సిగ్గుచేటన్నారు. పరిస్థితి మారాలని, చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చ జరగాలని అన్నారు. లక్షలు, కోట్లమంది చట్టసభల్లో జరుగుతున్న తీరును చూసి ఏం నేర్చుకోవాలి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు ప్రత్యర్ధులమే కానీ శత్రువులు కాదని గుర్తుంచుకోవాలన్నారు. క్రమశిక్షణతో మెలగాలన్నారు.