ఇంటర్నెట్ వినియోగం పెరగడం, ఇప్పుడు అందరి చేతిల్లో స్మార్ట్ ఫోన్లు కూడా ఉండడంతో సోషల్ మీడియాకు చాలామంది బానిసలుగా మారిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ గుర్తింపు పొందాలని తాపత్రయపడుతున్నారు. అయితే ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే స్పృహ కూడా లేకుండా మరి ప్రవర్తిస్తుండడం దారుణమని చెప్పాలి.
తాజాగా ఓ ఇద్దరు యువకులు ఏకంగా పోలీసు జీపుపైన కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యవకులు పోలీసు జీపు బ్యానెట్పై కూర్చొని సర్కార్ చిత్రంలోని జల్వా రే జల్వా పాటకు రీల్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీప్ను సర్వీస్ కోసం గ్యారేజీకి పంపామని, ఆ సమయంలో యువకులు వీడియో తీశారని విచారణలో తేలిందని వెల్లడించారు. వీడియోలో కనిపిస్తున్న వాహనం నంబర్ ప్లేట్ కాన్పూర్ దేహత్లోని అడిషనల్ డీజీ ఆఫ్ పోలీస్ పేరిట రిజిస్టర్ అయిందని తెలిపారు. త్వరలో వీరిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ సిసామావు అన్నారు.
https://twitter.com/News1IndiaTweet/status/1659458037382279168