
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో విద్యుత్ ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. తెలంగాణ లో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర ఉత్తర్వులు ఉన్నాయన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో దేశం మొత్తం రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని కేసీఆర్ చెప్పడం బీజేపీ కి రుచించడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని కేసీఆర్ దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతారన్నారు.
తెలంగాణకు రూ.12,941 కోట్లు రావాలని చెబుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్ర వాదనలు వినకుండా ఆంధ్ర వాదనలు విని కేంద్ర ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. విద్యుత్ రంగంలో బీజేపీ సాధించలేని విజయాన్ని తెలంగాణ సాధించిందనే అక్కసుతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఏడాది కాలంగా తెలంగాణ విద్యుత్ సంస్థలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వైఫల్యాల పై కేసీఆర్ ప్రశ్నిస్తునందునే తెలంగాణని టార్గెట్ చేస్తున్నారన్నారు.