Vijay Devarakonda: 100 మందికి ఫ్రీగా మనాలి ట్రిప్

Vijay Devarakonda: 100 మందికి ఫ్రీగా మనాలి ట్రిప్

విజయ్ దేవరకొండ తన అభిమానులకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించాడు. తన సొంత ఖర్చులతో  100 మంది అభిమానులను కులుమనాలి ట్రిప్ కు తీసుకెళ్తున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశాడు. గత ఐదేళ్లుగా దేవరకొండశాంటా పేరుతో విజయ్ దేవరకొండ తన అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ లు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో  ఇటీవల 100 మంది అభిమానులను ఫ్రీ వెకేషన్ కు తీసుకెళ్తానని విజయ్ దేవర కొండ తన ట్విట్టర్లో ప్రకటించాడు. అయితే ఎక్కడికి వెళ్లాలో కూడా తన అభిమానులకే ఛాయిస్ ఇచ్చాడు. అందులో  మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిసెర్ట్స్ ఇన్ ఇండియా... ఇలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. దీనిలో ఎక్కువగా మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియాకు 42.5 శాతం ఓటు వేశారు.   దీంతో 100 మందిని ఫ్రీగా కులుమనాలి తీసుకెళ్తున్నట్లు ఇవాళ ట్విట్టర్లో ప్రకటించాడు.

‘‘ఎక్కువ మంది కులుమనాలికి ఓటు వేశారు కాబట్టి. 100 మందిని అన్ని ఖర్చులతో నేనే  కులుమనాలీ పంపిస్తా. మనాలీకి ఐదు రోజుల పర్యటన ఉంటుంది. అక్కడ ఎత్తైన పర్వతాలు, ఆలయాలు,మఠాలకు వెళ్తారు. ఇంకా ఎన్నో ఆక్టివిటీస్ కు ప్లాన్ చేశాను. అయితే 18 ఏళ్లు నిండి, నన్ను ఫాలో అయ్యేవారు  దేవరశాంటా వెబ్ సైట్ లో డాక్యుమెంట్ ఫిల్ చేయండి. మీలో 100 మందిని ఎంపిక చేసి కులుమనాలి తీసుకెళ్తా. మీతో పాటు నేను కూడా వస్తా’’అంటూ విజయ్ దేవర కొండ వీడియో రిలీజ్ చేశాడు.