జులై 21న ప్రేక్షకుల ముందుకు విజయ భాస్కర్ జిలేబి 

జులై 21న ప్రేక్షకుల ముందుకు విజయ భాస్కర్ జిలేబి 

నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సక్సెస్ చిత్రాలను డైరెక్ట్ చేసిన కె.విజయ భాస్కర్ కొంత గ్యాప్ తర్వాత రూపొందించిన సినిమా ‘జిలేబి’. విజయ్ భాస్కర్ కొడుకు శ్రీకమల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని గుంటూరు రామకృష్ణ నిర్మించారు.  శివాని రాజశేఖర్ హీరోయిన్. 

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌‌, టీజర్‌‌‌‌కి  మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం జులై 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఇచ్చిన రిలీజ్ డేట్ పోస్టర్‌‌‌‌లో శ్రీకమల్, శివాని దేన్నో చాటుగా చూడటం ఇంటరెస్టింగ్‌‌గా ఉంది. 

మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.