బీఆర్ఎస్​పై రాములమ్మ ఫైర్​

బీఆర్ఎస్​పై రాములమ్మ ఫైర్​

హైదరాబాద్​: బీఆర్​ఎస్​ పార్టీపై రాములమ్మ మరోసారి ఫైర్​ అయ్యారు. తుంటికి ఆపరేషన్​ చేసుకొని కోలుకుంటున్న కేసీఆర్​ తిరిగి జిల్లాల పర్యటనకు వెళతారని ఆ పార్టీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

దీనిపై కాంగ్రెస్​ లీడర్​ విజయశాంతి  స్పందిస్తూ ‘‘ అవును మీ నేత తిరిగొచ్చిండు‌‌.. కానీ, కాంగ్రెస్ మీ పార్టీ కన్నా ఎంతో ముందుంది అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిందని పేర్కొన్నారు. ప్రజలను బానిసల్లాగా చూసిన మీ భవిత రహిత సమితి పార్టీకి తెలంగాణలో ఇంక చోటు లేదు”అని ఎక్స్​లో పోస్ట్ చేశారు.