వివేక్‌పై ఐటీ, ఈడీ దాడులను ఖండించిన విజయశాంతి

వివేక్‌పై ఐటీ, ఈడీ దాడులను ఖండించిన విజయశాంతి

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్, బీజేపీ ఒక్కటేనని తాను చెప్పిన విషయం నిజమవుతున్నదని కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసుల మీద ఐటీ, ఈడీ దాడులను ఖండిస్తున్నట్లు బుధవారం ఆమె ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. బీఆర్‌‌ఎస్ ఫిర్యాదు చేయగానే ఐటీ, ఈడీలను బీజేపీ పంపిస్తున్నదని ఆరోపించారు.

ఇన్ని రోజులు బీజేపీలో ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామిపై ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు జరగలేదని, కానీ, ఇప్పుడు బాల్క సుమన్ ఫిర్యాదు చేయగానే దాడులు జరిగాయన్నారు. బీజేపీ నుంచి బయటకు రాగానే ఐటీ, ఈడీ దాడులు దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు. ఎవరేం చేసినా భయపడేది లేదని, వివేక్ వెంకటస్వామి అయినా, తానైనా ఎవరం భయపడబోమన్నారు. మిగతా ఉద్యమకారులూ భయపడరని, ఎంతవరకైనా కొట్లాడదామన్నారు.