సీఎం కేసీఆర్ చేసిన అవినీతిని ఖచ్చితంగా టచ్ చేస్తామని హెచ్చరించారు బీజేపీ నేత విజయశాంతి. టూరిస్ట్ సీఎంగా కేసీఆర్ కు పేరు పెడుతున్నా అని అన్నారు. దుబాయ్ లో కేసీఆర్ కొంటున్న ఆస్తుల ను టచ్ చేస్తామన్నారు. హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే సమయం కేసీఆర్ కు లేదని విమర్శించారు. కేసీఆర్ కు రిటైర్మెంట్ ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని.. బీజేపీ అంటే కేసీఆర్ కు బీపీ పెరుగుతోందన్నారు.
హుజురాబాద్ ఓటమితో ఆయనలో ఫ్రస్టేషన్ పెరిగిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను కమేడియన్ గా చూస్తున్నారన్న విజయశాంతి.. దళితబంధు అమలు చేసేవరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.