- సారాభాయ్ శత జయంతి వేడుకల సందర్భంగా మోడీ
- నివాళులు అర్పిస్తూ వీడియో సందేశం
- అహ్మదాబాద్లో వేడుకలు
అహ్మదాబాద్: ‘స్పేస్, న్యూక్లియర్ టెక్నాలజీలో ప్రపంచ దేశాలు అబ్బురపడే ప్రగతి సాధించడం వెనక డాక్టర్విక్రమ్ సారాభాయ్ వేసిన పునాదే కారణం. ఆయన విజన్వల్లే నేడు ఇస్రో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. 1960లో తుంబ కేంద్రం నుంచి సారాభాయ్ ప్రయోగించిన రాకెట్ మూలాలతోనే ఇస్రో విజయవంతంగా దూసుకెళుతోంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ శత జయంతి వేడుకల సందర్భంగా నివాళులు అర్పిస్తూ మోడీ ఓ వీడియో సందేశాన్ని పంపించారు. అహ్మదాబాద్లో జరిగిన సారాభాయ్ వేడుకల్లో నిర్వాహకులు ఈ వీడియోను ప్రదర్శించారు. ఏడాది పాటు జరగనున్న వేడుకలను ఇస్రో డిపార్ట్మెంట్ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ఆఫ్ అటామిక్ఎనర్జీ సంయుక్తంగా సోమవారం ప్రారంభించాయి. అంతరిక్ష పితామహుడిగా పేరొందిన సారాబాయికి చంద్రుడిపై రోవర్ల్యాండ్ చేయడం ద్వారా 130 కోట్ల భారతీయుల తరఫున ఘన నివాళి అర్పించనున్నట్లు ప్రధాని చెప్పారు. ఫేమస్ సైంటిస్ట్ హోమీ బాబా మరణంతో ఏర్పడిన లోటును సారాభాయ్ పూడ్చారని ప్రధాని కొనియాడారు. స్పేస్, న్యూక్లియర్ టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యుడికి అందుబాటులోకి తేవడం ఆయన విజన్ వల్లే సాధ్యమైందన్నారు. సొసైటీలోని సమస్యలను పరిష్కరించేందుకు టెక్నాలజీ వాడటానికి వెనకాడొద్దని ప్రజలను ఆయన కోరారని చెప్పారు. కార్యక్రమంలో ఇస్రో చైర్మన్శివన్, మాజీ చైర్మన్ కె.కస్తూరిరంగన్, సారాభాయ్ కొడుకు కార్తికేయ సారాభాయ్ పాల్గొన్నారు.