శామీర్ పేటలో ఉద్రిక్తత.. మల్లారెడ్డి కొడుకును అడ్డుకున్న గ్రామస్తులు

శామీర్ పేటలో ఉద్రిక్తత.. మల్లారెడ్డి కొడుకును అడ్డుకున్న గ్రామస్తులు

మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం ఉప్పరపల్లిలో ఆందోళన చేపట్టారు గ్రామస్థులు. తమకు ప్రభుత్వం పట్టాలిచ్చిన భూమిని కబ్జా చేస్తున్నారంటూ హైవేపై ధర్నాకు దిగారు. సర్వే నంబర్ 837 38 భూముల్లో  రాత్రికి రాత్రే 300ల గుడిసెలు వేసి.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమకు ఇచ్చిన ప్లాట్ లలో వేరే వాళ్లు గుడిసెలు వేసుకుని కబ్జాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. 

మంత్రి మల్లారెడ్డి, సీఎం కేసీఆర్ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో ధర్నా విరమించే సమయంలో.. మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్  రెడ్డి వాహనం రావడంతో.. వాహనాన్ని అడ్డుకున్నారు గ్రామస్థులు. వాహనాన్ని చుట్టుముట్టి మీ తండ్రి  ఎలాగూ తమకు న్యాయం చేయడం లేదని కనీసం మీరైనా న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు....